News June 27, 2024

టీటీడీకి చెందిన రుషికొండ వద్దగల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జులై 1వ తేదీ నుంచి శ్రీవారి సేవలో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవకు రూ.100, పుష్పాలంకరణకు రూ.12,000 (నలుగురు కుటుంబ సభ్యులు) తోమాలసేవకు ఒక్కొక్కరికి రూ.200, సహస్రనామార్చనకు రూ.200 నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.