ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రద్దు చేసుకొని ఈ నెల 12న తిరిగి ఇండియాకు వస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని సీఎంఓ కార్యాలయం ఖండించింది. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని.. ఆకస్మికంగా ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తెలిపింది. అవాస్తవాలను ప్రచారం చేస్తూ మీడియాను, ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయింది.

పూర్తిగా చదవండి..