News June 29, 2024

జిల్లాలో జీడి పంట, పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. స్థానిక జీడి పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు విదేశాల నుంచి సరిపడనంతగా రాకపోవడతో డిమాండ్ పెరిగి జీడి ధరలు అమాంతం పెరిగాయి. 80 కేజీల జీడి పిక్కల బస్తా ధర గతంలో రూ. 8 వేల వరకూ ఉండగా, ప్రస్తుతం రూ. 13,500 వరకూ ధర పలుకుతోంది. అయితే ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గటంతో ఆశించిన స్థాయిలో ఆదాయం చేకూరలేదని రైతులు వాపోతున్నారు.