News June 29, 2024

వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని EO కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11.45- మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు, మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు.