ఈ వార్తను అనువదించండి:

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్‌లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని హత్య విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హస్పిటల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలిచారు. తమ బిడ్డ పై అత్యాచారం చేసి అన్యాయంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

పూర్తిగా చదవండి..