ఈ వార్తను అనువదించండి:
హోంమంత్రి అనిత: 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1730 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారని అన్నారు హోంమంత్రి అనిత. దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయని చెప్పారు. నిత్యజీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. యాప్లకు మనమిస్తున్న సమస్త సమాచారం ఒక్క క్లిక్తో మోసానికి దారితీస్తుందని అన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని.. బ్యాంకు ఖాతానెంబర్, ఓటీపీలు, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు.