ఈ వార్తను అనువదించండి:

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెంచారు. ఇక్కడ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తానన్నారు. యువకులు, బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: Bandi sanjay: త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!

పూర్తిగా చదవండి..