ఈ వార్తను అనువదించండి:
Breaking: దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. నట్వర్ సింగ్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో మంత్రిగా పనిచేశారు.
పూర్తిగా చదవండి..
కేంద్ర మాజీ మంత్రి మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శర్మ.. “నట్వర్ సింగ్ జీ మరణవార్త చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Also read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు…ఇక నుంచి ఆ పేరుతో!
[vuukle]