తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ  అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు విక్రమ్ అభిమానులు.  ఈ విలక్షణ నటుడు  భారీ విజయాన్ని అందుకొని ఏళ్ళు గడుస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తంగలాన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.

Also Read: Dhanush: వారెవా రాయన్.. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన ధనుష్..

కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆంగ్లేయుల కాలంలో బంగారు గనుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆ బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విక్రమ్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా, లేదా అనే   సందేహం అభిమానులలో ఉంది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై విక్రమ్ స్పందిస్తూ.. ‘ఈ కథ భిన్నంగా ఉంటుంది. ప్రీక్వెల్‌, సీక్వెల్‌ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. రెండో పార్ట్‌ అయితే కచ్చితంగా ఉంటుంది. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని నాలుగు భాగాలుగా కూడా ప్రేక్షకులకు అందించొచ్చు. రాబోయే భాగాలు కొత్తగా ఉంటాయి. ఈ కథకు చాలా బలం ఉందని. నటీ నటుల కాస్ట్యూమ్స్‌ కూడా భిన్నంగా ఉంటాయి’ అని తెలిపారు.