ఈ వార్తను అనువదించండి:

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఐటీ, సీఎస్ఎస్ఈ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని కొనియాడారు. విద్యార్థులంతా మోహన్ బాబును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో నటించే వ్యక్తి మోహన్ బాబు అని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. తల్లి, తండ్రి, గురువు, దైవాలను ప్రతీ విద్యార్థి పూజించాలని మోహన్ బాబు సూచించారు. అప్పుడే ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదుగుతారన్నారు.

పూర్తిగా చదవండి..