అమెరికాకి చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్.. సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్పై శనివారం రాత్రి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచడం కోసం వినియోగించిన మారిషస్ ఫండ్లోలలో మాదభి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు తెలిపింది. విజిల్బ్లోయర్ పత్రాల ప్రకారం.. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నాయని.. ఇందులోనే మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్లకు షేర్లు ఉన్నట్లు వివరించింది. ఈ దంపతుల షేర్ల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (రూ.83 కోట్లు) వరకు ఉండొచ్చని చెప్పింది. మరోవైపు హిండెన్ బర్గ్ ఆరోపణలను మాధబి పురి ఖండించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై చర్చనీయాంశమవుతోంది.
Also Read: నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?
అయితే తాజాగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. సెబీ ఛైర్పర్సన్పై ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇందులో సంస్థ రాజీపడిందని ఆరోపించారు. దేవ్యాప్తంగా ఉన్న నిజాయతీ గల ఇన్వెస్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. ఇంత జరిగాకా కూడా సెబీ ఛైర్పర్సన్ మాదబి ఇంకా ఎందుకు రాజీనామా చేయాలేదని ప్రశ్నించారు. ఒకవేళ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించింది కోల్పోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు.. ప్రధాని మోదీ, సెబీ ఛైర్పర్సన్ లేదా గౌతమ్ అదానియా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి సీరియస్ ఆరోపణలు బయటకి వచ్చినప్పడు.. సుప్రీంకోర్టు ఈ విషయంలో మరోసారి సుమోటోగా తీసుకుంటుందా అని ప్రశ్నించారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమైందని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే అదానీ కంపెనీలో షెల్ కంపెనీల ద్వారా ఇన్వెస్ట్ చేసిన రూ.20 వేల కోట్లు ఎవరివని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే.. తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అందుకే ఈ అశంలో విచారణ జరిపేందుకు సెబీ లాంటి సంస్థలు రాజీపడ్డాయని మండిపడ్డారు.
చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ అయిన SEBI యొక్క సమగ్రత దాని చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీ పడింది.
దేశవ్యాప్తంగా ఉన్న నిజాయితీగల పెట్టుబడిదారులు ప్రభుత్వానికి నొక్కే ప్రశ్నలు: