ED Cracks Down on

ఓ ప్రముఖ మీడియా సంస్థ ఓనర్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున ED కేసులు ఉన్నావని అందరికీ తెలిసిందే. విదేశాల్లో వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున డబ్బులు హవాలలో తరలించి అడ్డంగా బుక్ అయిన ఆయన ఇప్పుడు తను నిర్వహించే మీడియా సంస్థ యొక్క ఖర్చు మొత్తం క్యాష్ రూపంలో ఖర్చు పెడుతున్నారట. ఈ విషయం బయటకు పొక్కటంతో సదరు మీడియా సంస్థ పై ED అధికారులు రైడ్ చేశారు.

గత సంవత్సర కాలంగా ఆ మీడియా సంస్థను నడుపుతున్న ఆ వ్యక్తి క్యాష్ లో అంత డబ్బు ఎలా ఖర్చు పెట్టారనే లెక్కలు బయటకు తీస్తే విస్తుబోయే నిజాలు బయటకు వచ్చాయ్. ఆ సంస్థ కోసం కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్ కు సైతం బిల్లులు లేవు.. అన్ని కాష్ లోనే చెల్లింపులు జరిగినట్లు ED అధికారులు గుర్తించారు. ఎంప్లాయిస్ జీతాలు సైతం క్యాష్ లోనే ఇస్తున్న విషయాలు అన్నిటినీ లెక్కలు బయటకు తీశారు.

రెండు రోజులుగా గోప్యంగా విచారణ చేస్తు లెక్కలపై ప్రశ్నలు వేసి సదరు వ్యక్తిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అసలు విషయం అంత బట్ట బయలు కావటంతో ఆ ప్రముఖ వ్యక్తి పరారిలో ఉన్నాడట. ఆఫీస్ ఒక ఫ్లోర్ అంతా, ఏడున్నర కోట్ల నగదు ED అధికారులు సీజ్ చేశారట. ఆ వ్యక్తి యొక్క ఎంప్లాయిస్ ను అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారట.