News June 29, 2024
ఇవాళ T20WC ఫైనల్లో తలపడనున్న భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఓ అరుదైన ఘనతను నమోదు చేశాయి. గ్రూప్, సూపర్-8 దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని టీమ్లు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. భారత్ గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, USA, సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించింది. సౌతాఫ్రికా గ్రూప్ దశలో శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లా, నేపాల్, సూపర్-8లో USA, ఇంగ్లండ్, విండీస్, సెమీస్లో అఫ్గాన్పై గెలిచింది.