ఈ వార్తను అనువదించండి:

Vallabhaneni Vamsi Mohan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఇచ్చే తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రేరణతోనే గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆయన అనుచరులే పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో వంశీని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.

పూర్తిగా చదవండి..