S.V.Satyanarayana: సాధారణ వాక్యాన్ని కవితామయం చేయడం కష్టం. జీవితం ఉన్నవారికి అది సులభం. రాయడం ఎంత ముఖ్యమో, ఎదుటి వారికి ఆ జీవితాన్ని అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యం. నిత్య కల్లోలాన్ని ఎదుటివారి మనోఫలకంపై చిత్రించే చతురత అందరికి అబ్బే కళ కాదు. మానవత్వాన్ని కవిత్వీకరించడంతో మొదలై అభ్యుదయాన్ని విప్పి చెప్పే దశను సాహిత్యంలో నిర్మాణం చేసిన కవి ఎస్వీ. సత్యనారాయణ. అన్ని విషయాలపై స్పష్టత గల వ్యక్తిగా తన జీవిత ప్రయాణానికి తానే వ్యాఖ్యానం రాసుకున్నట్లుగా ఒక కింది కవితలో ఇలా ప్రత్యక్షమవుతాడు.