- బాలీవుడ్ మోజులో మరాఠి భామ
- ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్
- ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భామ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రం బ్లాక్ బస్టర్ కావటమే కాదు, సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్లో అవకాశాలు కోసం అమ్మడు అటుగా దృష్టి సారించింది.
Also Read: upasana konidela : ఏ సమాజంలో బ్రతుకుతున్నాం.. ఇదేనా స్వాతంత్ర్యం అంటే..
ఈ నేపథ్యంలో పలు తెలుగు సినిమాలకు నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కాగా మృణాల్ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ప్రభాస్ కు కరెక్ట్ జోడిగా అమ్మడు సెట్ అవుతుందని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్కి మృణాల్ నిరాశనే మిగిల్చింది. రీసెంట్గా ఓ అభిమాని ప్రభాస్ సినిమా గురించి మృణాల్ ని ప్రశ్నించగా తాను ఆ సినిమాలో చేయటం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా నార్త్ సినిమాలపైనే ఉందని ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది.
Also Read: Mr bachchan: మిస్టర్ బచ్చన్ లో కనిపించిన నైజాం నయా నవాబ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే..?
టాలీవుడ్లో అవకాశాలు వస్తున్న కూడా మృణాల్ బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో ఎందరో హీరోయిన్స్ ఇలా బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ సినిమాలకు నో చెప్పి చివరికి సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుండైనా సౌత్ సినిమాలు కూడా చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటే మృణాల్ కెరీర్ బాగుంటుందని సలాహాలు ఇస్తున్నారు నెటిజన్స్.