Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబం మధ్య కాస్త దూరం పెరిగిన సంగతి మనకు తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వివాదం కాస్త ముదిరిపోయింది. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాల గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే రెండు కుటుంబాల మధ్య సంధి చేయడం కోసం ఓ హీరో ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కానీ మెగా కుటుంబంతో అల్లు అర్జున్ కు సంధి లేదని ఇక సమరమే అంటూ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

ఇటీవల నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక మాట్లాడుతూ మెగా కుటుంబ సభ్యుల గురించి గొప్పగా చెప్పారు కానీ అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని మాత్రం గుర్తు చేయలేదు. అయితే తాజాగా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ పోస్టులు చేశారు.

ఆయ్ సినిమాను ప్రమోట్ చేసిన బన్నీ..

తాజాగా అల్లు అర్జున్ బన్నీ వాసు ఆయ్ సినిమాను ప్రమోట్ చేశాడు.. కమిటీ కుర్రాలను మాత్రం పట్టించుకోలేదు. దీంతో మెగా కుటుంబంతో గొడవలు ఉన్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మెగా కుటుంబంతో రాజీ పడాలి అనుకుంటే కచ్చితంగా కమిటీ కుర్రాళ్ళు సినిమా గురించి ఒక పోస్ట్ అయినా చేసేవారు అలా చేయలేదు అంటే మెగా కుటుంబంతో తనకు సంధి అవసరం లేదని అల్లు అర్జున్ భావించినట్టు తెలుస్తుంది.