ఈ వార్తను అనువదించండి:

గుంటూరు: గుంటూరు జిల్లాలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు జగన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి హృద‌యం నేడు గ‌ర్వంతో నిండే రోజు అని అన్నారు. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజని.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర కోసం పోరాడిన యోధులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.