ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. ఫస్ట్ వినిపించే పేరు రష్మిక మందన్నా. ప్రస్తుతం అటు బాలీవుడ్‌లో, ఇటు సౌత్‌లో ఆమె జోరు మాములుగా లేదు. అగ్ర హీరోల సరసన నటిస్తూ.. నేషనల్ క్రష్ అనే ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక.. పుష్ప 2 తో పాటు రెయిన్ బో, ది గర్ల్‌ఫ్రెండ్, చావా, సికిందర్, కుబేర చిత్రాలతో బిజీగా ఉంది. అయితే రష్మికకు సంబంధించిన ఓ ఓల్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది ఆమె సినిమా కెరీర్ స్టార్టింగ్‌లో దిగిందిగా అనిపిస్తుంది. పైన ఫోటోలో రష్మిక పక్కన ఓ అమ్మాయి ఉంది గమనించారా..? తను కూడా ఇప్పుడు పెద్ద హీరోయిన్. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ఆ బ్యూటీకి యూత్‌లో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఇంతకీ తనెవరరో మీరు కనిపెట్టగలరా..?. వారి క్లోజ్‌నెస్ చూస్తుంటే ఇద్దరూ ఎప్పటినుంచో మంచి స్నేహితులుగా అనిపిస్తుంది.

తనెవరో మీకు తెలిస్తే ఓకే.. తెలియని వాళ్ల కోసం మేమే చెప్పేస్తున్నాం. తను మరెవరో కాదు క్రేజీ హీరోయిన్… ఆషికా రంగనాథ్. వీరిద్దరి ఓల్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆషికా.. కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో.. ఆమెకు అంత ఫేమ్ రాలేదు. దీంతో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఆ తర్వాత కింగ్ నాగ్ సరసన.. నా సామిరంగ సినిమాతో అమ్మడకు మంచి పాపులారిటీ వచ్చింది. కుర్రాళ్లు అయితే తమ నయా క్రష్ ఆషికా అని ప్రకటించేసుకున్నారు. ప్రస్తుతం రష్మిక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాక కన్నడలో మరో 2 సినిమాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.