- నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం
- దేశం మొత్తం అంబరాన్నంటిన సంబరాలు
- స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొన్న నటుడు దివ్యేందు శర్మ
- స్వాతంత్ర్యం గురించి పలు వ్యాఖ్యలు
ఈ రోజు భారతదేశానికి 78వ స్వాతంత్ర్య దినోత్సవం. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజానీకమైనా, సెలబ్రిటీలైనా, ప్రతి భారతీయుని గర్వంతో సెల్యూట్ చేసే రోజిది. భారత్.. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కలలు కంటోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న నటుడు దివ్యేందు శర్మ స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ఒక సమాజంగా మన దేశం ఎలా ఉన్నతంగా ఎదగగలదో చెప్పారు.
READ MORE: Car Safety: కారులో ఉండే బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఏంటో తెలుసా..? ఉపయోగాలేంటి
‘ప్యార్ కా పంచ్నామా’, ‘మీర్జాపూర్’ ఫేమ్ నటుడు దివ్యేందు శర్మ స్వాతంత్ర్య దినోత్సవం గురించి.. ఆధునిక ప్రపంచంలో స్వేచ్ఛగా ఉండటం అంటే ఏమిటో ఫిల్మ్ఫేర్తో చెప్పారు. దివ్యేందు మాట్లాడుతూ.. ” ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఈ సమయంలో ప్రపంచానికి చాలా అవసరం. నేను పొలిటికల్ సైన్స్ విద్యార్థిని, కాబట్టి ఇది నా ఆలోచన. నేను అరిస్టాటిల్, మాకియవెల్లి చాలా మంది గొప్ప ఆలోచనాపరులను చదివాను. మీ వాక్ స్వాతంత్ర్యం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. మీరు ఎవరైనప్పటికీ.. ఎలాంటి విమర్శలు లేకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ మీకు ఉండాలి. స్వేచ్ఛ అంటే మనమందరం ఒకరి దృక్కోణాన్ని గౌరవించే సమాజంలో జీవించడం. అప్పుడే మనం సమాజంగా ముందుకు సాగగలమని నేను భావిస్తున్నాను. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు పరస్పరం సహకరించుకోవడం ఎంతో అవసరం.” అని దివ్యేందు ఉద్ఘాటించారు.