• బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్

  • తిరుచిత్రంబళం మేఘం కరిగేనా సాంగ్ కొరియోగ్రఫీకి నేషనల్ అవార్డు

  • తెలుగులో తిరు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్

Jani Master Wins Best Choreography National Award for ‘Megham Karukatha’ in Thiruchitrambalam: తెలుగులో ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు లభించింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్ కారణంగా ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ఆయన స్వస్థలం నెల్లూరు. అయితే ఆయన చేసిన ఒక తమిళ సినిమాకి ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కించుకున్నారు. ఆ సినిమా తిరుచిత్రంబళం. ఇదే సినిమాని తెలుగులో తిరు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ధనుష్ హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించారు.

National Film Awards: బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి.. బెస్ట్ మూవీగా ఆట్టం.. నేషనల్ అవార్డు విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే

అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గాను జానీ మాస్టర్ చేసిన మేఘం కరిగేనా అనే సాంగ్ కొరియోగ్రఫీ చూసిన జ్యూరీ మెంబర్లు ఫిదా అయిపోయారు. కానీ ఈ అవార్డుని ఆయన మరొక కొరియోగ్రాఫర్ తో కలిసి పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సతీష్ కృష్ణన్ తో కలిసి జానీ మాస్టర్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన నిత్యా మీనన్ కి బెస్ట్ యాక్ట్రెస్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు లభించింది. ఆమె కూడా ఖర్చు ఎక్స్ప్రెస్ సినిమాలో నటించిన మానసి పరేఖ్ తో కలిసి ఈ అవార్డుని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జనసేన పార్టీలో చేరి గత ఎన్నికలకు ముందు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.