News June 29, 2024

ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముకేశ్ కుమార్ మీనా, కలెక్టర్ సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు.