T20WC థ్రిల్లింగ్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్‌లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్‌ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, అర్ష్‌దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.