• టాలీవుడ్ టు బాలీవుడ్
  • రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు వేరే లెవల్
  • ఒకేరోజు రెండు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ కు రెడీ

నేషనల్ క్రేజ్ రష్మిక మాములుగా లేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప -2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.

Also Read: Release Clash: రజనీకాంత్ ‘వేటగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్యతో పోటీకి రెడీ..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో బన్నీ, రష్మికపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ డిసెంబరు 6న రిలీజ్ కు గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. మరోవైపు క్రష్మిక బాలీవుడ్ లో దూసుకు వెళుతోంది. తాజగా విక్కీ కౌశల్ సరసన ‘చావా’ చిత్రంలో నటిస్తుంది క్రష్మిక. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసారు మేకర్స్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఆధారంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను కూడా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. దింతో ఒకేరోజు, ఒకేసారి, ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతన్న హీరోయిన్ గా క్రష్మిక క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్ లో సోలో రిలీజ్ దొరుకుతుందని భావించిన పుష్ప -2కు చావా రూపంలో పోటీ ఎదురైంది.