ఎమ్మెల్సీ కవిత: తీహార్ జైలులో మరోసారి ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ భారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు జైలు సిబ్బంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post BIG BREAKING: జైలులో కవితకు అస్వస్థత appeared first on Rtvlive.com.