ఏపీలో పేలుడు: అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే ఏపీలో మరో రియాక్టర్ పేలింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్ లో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్థరాత్రి 12:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమం, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. విశాఖ ఇండస్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితకు ఆదేశించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ సేవలను ఉపయోగించాలని అన్నారు.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి….

The post BIG BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం appeared first on Rtvlive.com.