ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

పూర్తిగా చదవండి..