ఈ వార్తను అనువదించండి:

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు. రామకృష్ణారెడ్డి జైలు నుంచి నేరుగా బయట వేచివున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారులో ఎక్కారు. ఆయన చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసుల్లో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.

పూర్తిగా చదవండి..