News June 29, 2024

అనంతపురంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 27 బెంచ్‌లు నిర్వహించారు. రాజీ పడదగిన 707 క్రిమినల్ కేసులు, 69 సివిల్ కేసులు, 26 మోటారు వాహనాల పరిహారం కేసులు, 3,254 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సత్యవాణి పర్యవేక్షించారు.