Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి చివరిగా RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఈయన అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఒక అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రకటించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన వెలబడలేదు.

ఇలా ఈ సినిమా ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ సినిమా పట్ల ఎంతోమంది అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమా ప్రారంభించడానికి ఏడాది సమయం తీసుకుంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలవడానికి ఎన్నేళ్ల సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.

హాలీవుడ్ స్టూడియోతో టై అప్..
ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారట. హాలీవుడ్ స్టూడియోతో టై అప్ అవుతూ ఈ సినిమా చేయాలని భావించారట అందుకు గాను ఈయన ఒక హాలీవుడ్ స్టూడియోకి రికమెండ్ పెట్టుకున్నారని కన్ఫర్మేషన్ కోసమే ఎదురు చూస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే కనుక హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన తెలుగు సినిమా సత్తా ఏంటో రాజమౌళి చూపించబోతున్నారని సమాచారం.