chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఏదైనా సినిమా విడుదలవుతుందన్నా లేదా సినిమా ఈవెంట్ కి వస్తున్నారన్న కూడా పెద్ద ఎత్తున మెగా అభిమానులు కూడా ఆ కార్యక్రమానికి చేరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా విడుదల సమయంలో ఓ వేదికపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తిరిగి ఇంద్ర సినిమాని విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అంతేకాకుండా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ కి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేయడంతో ఆ వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా వేడుకలో భాగంగా చిరంజీవి అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నిజంగా నా అదృష్టం గొప్పతనం అంతా నాది కాదని మీదేనని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు అయితే నేను ఇలాంటి ఒక సినిమా వేడుకకు వచ్చిన తర్వాత నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పోంగిపోతుంది అయితే ఇంటికి వెళ్ళగానే నేను ఆరోజు రాత్రి నేలపైనే పడుకొని నిద్రపోతానని తెలిపారు.

నేలపై పడుకుంటాను..
ఇలా నేలపై పడుకోవటం వల్ల నాకు ఆ గర్వం అనేది తలకు ఎక్కదు. నేనింకా కింది స్థాయిలోనే ఉన్నాను అనే భావన నాకు కలుగుతుంది. ఈ అభిమానుల ప్రేమను నేను ఎప్పుడు గుండెల్లో దాచుకుంటానే తప్ప తలకు ఎక్కించుకోనని ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.