Also Read: కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు
కవిత తరఫున వాదనలు వినిపిస్తున్నా న్యాయవాది ముకుల్ రోహత్గీ.. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని.. ఎక్కడికీ పారిపోరని అన్నారు. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారని.. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు.
ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉంటున్నారని, సీబీఐ కేసులో 4నెలలు జైల్లో ఉంటున్నారన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారని.. కవిత ఎవరినీ బెదిరించలేదని తెలిపారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని.. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయన్నారు.
ఈడీ తరుఫున న్యాయవాది ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ఈడీ నోటీస్ రాగానే కవిత అన్ని ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారని.. సాక్ష్యాలను కవిత తారుమారు చేశారని పేర్కొన్నారు. విచారణ సమయంలో కవిత సహకరించలేదన్నారు.
[vuukle]