Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ మెగా మేనల్లుడుగా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే ఇటీవల ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఈయన కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

తన మామయ్య పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు తన విజయాన్ని గుర్తు చేస్తూ ఈయన సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ వర్తమానం, భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కల్యాణ్ ‘బలమైన తుపాను’ సృష్టించారని కొనియాడాడు.

తాజాగా ఈయన చేసిన ట్వీట్ గుర్తు చేస్తూ పలువురు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాల పట్ల ఎందుకు స్పందించడం లేదు అంటూ పలువురు ఈయనని ట్యాగ్ చేస్తున్నారు.ఈ క్రమంలో వైసీపీకి చెందిన డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత… సాయిధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. గతంలో ఏపీలో జరుగుతున్న దారుణాల పట్ల స్పందించిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు అన్న క్యాంటీన్ల విషయంలో జరుగుతున్న దారుణాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

మెడలు రుద్దే Safe Hands ఎక్కడ …అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా Safe Handsతో అంటూ సాయి తేజ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే దీనికి సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ మీరు ఎక్కడుంటారు. ఎగ్ పఫ్ లో మీరు ఎంత తిన్నారు ప్రదీప్ అంటూ సాయి ధరమ్ తేజ్ చురకలు అంటించారు. దాంతో వైసిపి కార్యకర్తలు ఎగ్ పప్స్ పై… ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలి అంటూ ఈయనని ఓ ఆట ఆడుకుంటున్నారు.

మురుగునీరు..
ఏపీలో జరుగుతున్నటువంటి ఈ దారుణాల గురించి స్పందించమంటే ఎగ్ పఫ్ గురించి సిల్లీగా మాట్లాడతావా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఇటీవల తణుకు అన్నా క్యాంటీన్ లో మురుగు నీళ్లతో తినే ప్లేట్లను శుభ్రం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ ను దీనిపై ప్రశ్నిస్తే ఆయన మాత్రం ఆధారాలు లేని విషయంపై స్పందించడంతో భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.