ఈ వార్తను అనువదించండి:

AP పోలీస్ ఉద్యోగాలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ కూటమి ప్రభుత్వం మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను క్లియర్ చేసి వెంటనే దీనిపై కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ ఫస్ట్ లోపే నియామక ప్రక్రియ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ పీహెచ్‌డీ రామకృష్ణ సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

పూర్తిగా చదవండి..