News June 30, 2024

T20WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ట్రోఫీని గుండెలకు హత్తుకొని విజయాన్ని ఆస్వాదించారు. కాగా ఈ నేపథ్యంలోనే గతేడాది వరల్డ్ కప్‌‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ మార్ష్ కాళ్లు పెట్టిన క్షణాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మార్ష్ అందరి మనసును గాయపరిస్తే ఇప్పుడు రోహిత్ అందరి హృదయాలు గెలుచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. కల్చర్ పరంగా ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదేనని అంటున్నారు.