ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ తాలి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో  తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు సచివాలయం ఎదుట విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. కాగా కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడాన్ని బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. విపక్షాల డిమాండ్లను పక్కన పెట్టిన రేవంత్ సర్కార్.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పక్క ఏర్పాటు చేసి తీరుతామని చెప్పింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు తెలంగాణ  తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్.

పూర్తిగా చదవండి..