ఈ వార్తను అనువదించండి:

సచివాలయ ప్రాంగణంలో ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు సూచించారన్నారు. అందుకే ఈరోజు హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు. సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. పదేళ్లు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారన్నారు. నేనే తెలంగాణ.. తెలంగాణనే నేను అనేలా గత పాలకులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు వ్యతిరేకం. సచివాలయం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు గుండెకాయలాంటిదన్నారు. గత పాలకులు పదేళ్లు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని ఫైర్ అయ్యారు.

పూర్తిగా చదవండి..