లిక్కర్‌ కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కవిత ఇంటి వద్దకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేసి ఇంట్లోకి వెళ్లిన కవిత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. చాలారోజుల తర్వాత కవితను చూడటంతో వాళ్లింట్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కవిత.. తన అన్నయ్య కేటీఆర్‌కు రాఖీ కట్టింది. ఆ తర్వాత ఒకరినొకరు అప్యాయంగా హత్తుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Also Read: కడిగిన ముత్యంలా బయటకొస్తా.. నాన్న నాయకత్వంలో పోరాడుతా: కవిత


The post Watch Video: అన్నయ్యకు రాఖీ కట్టిన కవిత.. వీడియో వైరల్ appeared first on Rtvlive.com.