ఈ వార్తను అనువదించండి:

Tirupathi Reddy: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి GHMC అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో FTL పరిధిలో ఉన్న తిరుపతి రెడ్డి నివాసాన్ని చూపించేందుకు వెళ్లిన ఆర్టీవీ మహిళా జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్ పై తిరుపతి రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఆయన నివాసాన్ని చిత్రీకరించేందుకు అనుమతులు లేవని అడ్డుకున్నారు. ఆయన నివాసాన్ని చూపించేందుకు ప్రయతించిన వీడియో జర్నలిస్ట్ కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. వీడియో తీసేందుకు పర్మిషన్ ఎందుకు అని ఆర్టీవీ ప్రతినిధి అడగ్గా.. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది.

పూర్తిగా చదవండి..