ఈ వార్తను అనువదించండి:

హైడ్రా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న డిమాండ్లపై మంత్రులతో చర్చించారు. హైడ్రాపై పలువురు కోర్టుకు వెళ్లడంతో తదుపరి కార్యాచరణపై మంత్రుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. అలాగే హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు విధివిధానాలు ఖరారు చేయడంతోపాటు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన వారిపై కఠిన క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఈ మీటింగ్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కూడా హాజరవడం విశేషం. కాగా హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

పూర్తిగా చదవండి..