ఈ వార్తను అనువదించండి:

YS Jagan: సహజంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నుంచి అధికార పక్షంలోకి జంపింగ్స్ జరుగుతూనే ఉంటాయి. తమకు ఓడిన పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదనో.. తామున్న పార్టీలో తమకు తగినంత ప్రాధాన్యం లేదనో ఇలాంటి రకరకాల కారణాలు ఈ పార్టీల మార్పు వెనుక ఉంటాయి. అధికారం కోల్పోయిన పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా అధికార పక్షం వైపు చేరిపోవడమూ సహజమే. ఎందుకంటే, తమ నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలనేది ఈ జంపింగ్ కు కారణంగా వారు చెబుతుంటారు. ఇప్పుడు సేమ్ సీన్ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీ నాయకుల్లో.. నేతల్లో చాలా నిరాశ కనిపిస్తోంది. కరుడుకట్టిన వైసీపీ నేతలు కూడా ఫలితాల పట్ల తీవ్ర అసంతృప్తిని బహిర్గతంగానే వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ జంపింగ్ మంత్రం జపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మరింతమంది ఎంపీలు ఉన్నారని చెబుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం గట్టిగా నడుస్తోంది.

పూర్తిగా చదవండి..