ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆమె ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కసారిగా ఎమ్మెల్యే కోవ లక్ష్మికి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోయాయి. దీంతో ఆమెను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Also Read: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు.. సీసీ కెమెరాల వెనుక రాజకీయ నేత కుమార్తె..!

అక్కడ ఎమ్మెల్యేకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ఆమెని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

The post BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్..! appeared first on Rtvlive.com.