న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న ‘ప్రణయగోదారి’ సినిమాను పి.ఎల్.విఘ్నేష్ డైరెక్ట్ చేస్తున్నారు. పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకోగా గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. గు గు గ్గు.. అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు.

Radhika : చెప్పుతో కొడితే సరిపోతుందా? విశాల్‌పై రాధిక సంచలన వ్యాఖ్యలు!

ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిళ్ళై గాత్రం కుర్రకారుని కట్టిపడేసేలా ఉంది. ఇక ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు… అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశా, పాట చాలా బాగుంది, హుక్ స్టెప్స్ బాగున్నాయని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.