ఈ వార్తను అనువదించండి:

Chandrababu Naidu: మూడు దశాబ్దాల క్రితం అనుకోని పరిస్థితుల్లో.. ఒకరకంగా ప్రజావ్యతిరేక స్థితిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాయకుడు.. తరువాత ప్రజాక్షేత్రంలో నిలిచి.. గెలుపు ఓటముల మధ్య రాజకీయాలను చేసి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఇదే రోజు అంటే సెప్టెంబర్ 1, 2095 నాడు ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. అప్పుడు ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పదవి చేపట్టాల్సి వచ్చింది. ప్రజల్లో పెద్దగా అప్పుడు ఆయనపై ఇష్టత లేదన్న అభిప్రాయం ఉంది. పైగా వెన్నుపోటు అనే నిందను మోయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ప్రజలను తనవైపుకు తిప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారు. తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో తనను తాను నిరూపించుకున్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే సగం కాలం అధికారంలో.. సగం కాలం అధికారం లేకుండా పార్టీని నడిపించారు. లెజెండరీ ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు ఇప్పటికీ అప్పటి ఆ మచ్చను భరిస్తూనే ఉన్నారు.

పూర్తిగా చదవండి..