Gudiwada: ఏపీలో జనసేన, వైసీపీ నాయకుల మధ్య వార్ నడుస్తోంది. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని క్షమాపణ చెప్పాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు.

గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికొచ్చిన పేర్ని నానిపైకి జనసేన కార్యకర్తలు దూసుకొచ్చారు. కొంతమంది రాళ్లతో దాడి చేయగా పేర్నినాని కారు అద్దాలు పగిలిపోయాయి. దాడి అనంతరం శివాజీ ఇంటిముందు ధర్నాకు దిగిన జనసైనికులు నాని బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేర్ని నాని క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జనసైనికులు చెబుతున్నారు.

The post Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పేర్నినానిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి! appeared first on Rtvlive.com.