ఈ వార్తను అనువదించండి:

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడికి ఊరట లభించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జి విజయ్‌ నయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనేది రూల్‌, జైల్‌ అనేది మినహాయింపు అనే సూత్రాన్నే అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఊటంకించింది. కస్టడీలో ఉన్న నిందితుడికి అది జైలు శిక్ష కాకూడదని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్‌ నయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉండగా..
గత ఏడాది జులై 3న విజయ్‌ నయర్‌కు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 12న కోర్టు.. ఈ బెయిల్‌ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని కోరింది.

పూర్తిగా చదవండి..