Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో హిరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకులుగా రాజకీయలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇటీవల చిత్ర పరిశ్రమ ఎంతో ఘనంగా బాలయ్య 50వ సినీ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక బాలకృష్ణ సినిమాలలోను, రాజకీయాలలోనూ మంచి సక్సెస్ కావడంలో తన భార్య వసుంధర కీలకపాత్ర పోషించిందని చెప్పాలి. ఈ విషయం గురించి బాలయ్య ఎన్నో సందర్భాలలో తన భార్య గొప్పతనం బయటపెట్టారు. తాను సినిమా షూటింగ్స్ నిమిత్తం విదేశాలకు వెళ్లి బిజీగా ఉన్నా వసుంధర మాత్రం తన కుటుంబాన్ని పిల్లలకు ఏ లోటు లేకుండా అన్ని చక్క దిద్ధేదని తెలిపారు.

ఇలా నా విజయంలో వసుంధర ఎంతో కీలక పాత్ర పోషించిందని, ఆమె నా భార్య మాత్రమే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు. ఇదిలా ఉండగా బాలయ్య సినిమా షూటింగుల కోసం విదేశాలకు వెళ్ళగా తన భార్య పిల్లలు విషయంలో చేసిన ఒక మోసాన్ని బయట పెట్టారు.

నేను సినిమా పనుల నిమిత్తం విదేశాలలో బిజీగా ఉంటాను కానీ తిరిగి వచ్చేటప్పుడు పిల్లలు వారికోసం ఏమైనా తెస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే వసుంధర ముందుగానే వారికోసం కొన్ని గిఫ్ట్స్ కొని ప్యాక్ చేసి ఎయిర్ పోర్ట్ కు పంపించే కారులో పెట్టేది. నేను ఇంటికి రాగానే నాన్న మీకోసం ఇవి తెచ్చారంటూ పిల్లలకు ఆ గిఫ్ట్స్ చూపించేదని బాలయ్య అసలు విషయం బయటపెట్టారు.

గిఫ్ట్స్ పంపించేది..
ఇలా పిల్లలు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా వారిని సంతోషపెట్టే విషయంలో పిల్లలను ఇలా మోసం చేసేది అంటూ బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక బాలయ్య దంపతులకు బ్రాహ్మిని, తేజస్విని, మోక్షజ్ఞ ముగ్గురు పిల్లలు అనే సంగతి మనకు తెలిసిందే.