ఈ వార్తను అనువదించండి:
రంగనాథ: హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్కు రేవంత్ సర్కార్ మరో కీలక బాధ్యత అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు రేపుతున్న రంగనాథ్కు ప్రజలు, ప్రముఖుల నుంచి భారీ మద్దతు పెరగడంతో మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన ‘లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ’ ఛైర్మన్గా రంగనాథ్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు తరాల కోసం చెరువులను పరిరక్షించాలని చెబుతున్న రేవంత్ రెడ్డి.. తను చేపట్టిన పనిని రంగానాథ్ ఆధ్వర్యంలో మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.