ఈ వార్తను అనువదించండి:

వైఎస్ షర్మిల: విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. RTVతో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఏమీ పట్టనట్లుగా ఉన్నారని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన రైతుకు ప్రతి ఎకరాకు రూ. 25,000 పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని.. కొంతమందికి మాత్రమే సహాయక చర్యలు అందుతున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సహాయం చేసేలాగా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.

పూర్తిగా చదవండి..