ఉత్తర కొరియా: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పాలనలో చిన్న పొరపాటు జరిగినా అధికారులతోపాటు ప్రజలకు భయంకరమైన శిక్షలు వేసే కిమ్ తాజాగా ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఉత్తర కొరిఆయాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పలు ప్రాంతాలు జలయమయం కావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతోపాటు భారీ నష్టం వాటిళ్లింది. దీంతో విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇది కూడా చదవండి; Encounter: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్!
ఈ మేరకు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారనే కారణంగా దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆగస్టులో వీరికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోగా.. కొద్ది రోజుల్లోనే వారికి మరణశిక్ష అమలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఇందులో చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జులై-ఆగస్టు నెలల్లో ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురిశాయి. వరదల్లో చాలా ఊర్లు గల్లంతు అయ్యాయి. దాదాపు 4వేల మంది చనిపోగా.. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. దీంతో స్వయంగా కిమ్ రంగంలోకి దిగి వరద ప్రాంతాల్లో పర్యటించారు.